అమృత్సర్: నిరంతరాయంగా ప్రాణనష్టం జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ వైపు నుంచి భారతదేశంలోకి చొరబాట్లు నిలువడంలేదు. పంజాబ్లోని అమృత్సర్ వద్ద ఇండో-పాక్ సరిహద్దులో బుధవారం పాకిస్తాన్ వైపు నుంచి చొరబాటుకు యత్నించిన ఒక వ్యక్తిని భద్రతాదళాలు కాల్చిచంపాయి.
ఆయన నుంచి రెండు ఏకే 47తో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి స్వాధీనపర్చుకున్నారు. సరిహద్దులోని ముళ్ల కంచె సమీపంలో ఆయుధాలు, హెరాయిన్ సరుకును దాటించేందుకు చొరబాటుదారుడు ప్రయత్నించినట్లుగా తెలుస్తున్నది.
భద్రతాబలగాలు కాల్చి చంపిన చొరబాటుదారుడి వద్ద 22 కిలోల హెరాయిన్ లభ్యమైంది. రెండు ఏకే 47 తుపాకులు, నాలుగు మ్యాగజైన్స్ 45 లైవ్ రౌండ్లు, పొడవైన ప్లాస్టిక్ పైపును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు.
అమృత్సర్లోని లాప్కో పోలీస్ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడిని గుర్తింపునకు సంబంధించి చొరబాటుదారుడి నుంచి ఎటువంటి పత్రాలు లభించలేదు. ఇండో-పాక్ సరిహద్దు వెంబడి ముళ్ల తీగ దగ్గర బీఎస్ఎఫ్, అమృత్సర్ గ్రామీణ పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ జరిగింది.
పాకిస్తాన్ స్మగ్లర్ బుధవారం తెల్లవారుజామున 4:00 గంటలకు ఆయుధాలు, హెరాయిన్ సరుకుతో భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. సమాచారంపై పాకిస్తాన్ చొరబాటుదారుడిని బీఎస్ఎఫ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి హతమార్చారు. ఆదివారం ఉదయం పుల్ మోరా సమీపంలో ముళ్ల కంచె వద్ద కూడా బీఎస్ఎఫ్ బలగాలు ఒక ముల్లెను స్వాధీనపర్చుకున్నది. దీనిని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ బలాల్ ఫీల్డ్ ఏజెంట్లు పంపినట్లు దర్యాప్తులో తేలింది.
డ్రగ్స్, ఆయుధాలను పంపించడానికి పాకిస్తాన్ నుంచి నిరంతరం చొరబాట్లు జరుగుతున్నాయి. గతంలో చాలా మంది చొరబాటుదారులు సరిహద్దును దాటడానికి ప్రయత్నించి హతమయ్యారు.
పరంబీర్సింగ్తో వాజ్ సన్నిహితంగా ఉండేవారు : కమిషనర్ నివేదిక
జవాన్ రాజేశ్వర్ విడుదలకు చర్చలు షురూ!
బెంగాల్ ఎన్నికల్లో ‘కూపన్ల పంపిణీ’ వివాదం
పరిచయం అక్కర్లేని సితార్ ప్లేయర్.. పండిత్ రవిశంకర్.. చరిత్రలో ఈరోజు
ప్రధానిపై అసత్య రాతలు.. బ్లాగర్కు 72 లక్షల జరిమానా
బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్ఖాన్
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..