భద్రాచలం: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతయ్యాడు. ఏపీలోని యటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మంగళవారం ద్విచక్రవాహనంపై భద్రాచలం బ్రిడ్జి వద్దకు చేరుకుని, బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు.
సాయంత్రం వరకు శివ ఆచూకి దొరకలేదు. యువకుడు ఆత్మహత్యా యత్నానికి ఎందుకు ఒడగట్టాడో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బైక్ లో యువకుడి ఆధార్ కార్డు, వాటర్ సప్లయ్ బుక్ లభించాయి. వీటిని బట్టి గోదావరిలోకి దూకిన వ్యక్తి చింతలగూడెం గ్రామానికి చెందిన శివగా పోలీసులు అనుమానిస్తున్నారు.