ఖమ్మం, మే 4 : స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తి, నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఖమ్మం నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి వెళ్లిన ఆయన అకడ ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథంతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అకడ టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సమావేశంలో నామా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తను ఎంపీగా ఉండి పార్టీ లోక్సభ ఫ్లోర్లీడర్గా పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం కృషిచేశానని తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాశానని పేర్కొన్నారు. టీడీపీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ వేరు చేయలేరని అన్నారు. ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతినేలా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో వెళ్లి పెద్దఎత్తున నిరసన దీక్ష చేశామని, అకడ చంద్రబాబుకు తగలబోయిన పోలీసుల లాఠీదెబ్బకు అడ్డు వెళ్లి ఆ దెబ్బ తిన్న చరిత్ర తనది అన్నారు. రాజకీయాలకు అతీతంగా టీడీపీ కు టుంబ సభ్యులకు ఎప్పుడూ అండగానే ఉన్నానని, భవిష్యత్లో కూడా అలానే ఉంటానని హా మీ ఇచ్చారు. ఖమ్మం ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ఆనాడు చేపట్టిన సైకిల్యాత్ర, బాబు పాదయాత్ర సందర్భంగా పైలాన్ ఏర్పాటు సహా పలు విషయాలను ఆయన గుర్తుచేశారు. జిల్లాలో ఎన్నోచోట్ల ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు, పార్టీ కార్యాలయాల నిర్మాణంలో తనపాత్ర ఎంతో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలను గమనించి టీడీపీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొండబాల కరుణాకర్, తాళ్లూరి అప్పారావు, సానెబోయిన శ్రీను, పాలడుగు కృష్ణప్రసాద్, నల్లమల రంజిత్, మందటి నరేశ్, వకుంతల వంశీ, మందపల్లి కోటి, కూచిపూడి జై, రజని, స్వప్న, నల్లమల శ్రీను, దామా శ్రీను, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.