మధిర, మే 4 : పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని, రైతుబిడ్డను నేనేనని, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆత్కూరు క్రాస్ రోడ్డు నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా అంబేద్కర్ సెంటర్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలు డప్పువాయిద్యాలతో నామాకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ అబద్ధాలు చెప్పేందుకు ప్రజల వద్దకు వస్తున్నారని, వారిని నిలదీయాలన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేలు, పెన్షన్దారులకు రూ.4 వేలు, తులం బంగారం పథకం, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై అనునిత్యం కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెలంగాణ రాష్ర్టాభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేశానని గుర్తు చేశారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ను విమర్శించే అర్హత, హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, మొండితోక జయాకర్, మార్కెట్ మాజీ చైర్మన్లు రంగిశెట్టి కోటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కనుమూరి వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్రెడ్డి, అరిగె శ్రీనివాసరావు, కోన నరేందర్రెడ్డి, చావా వేణు, కటికల సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు, మండల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
400 బైక్లతో ర్యాలీ
ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు.. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆత్కూరు రింగ్ రోడ్డు నుంచి 400 బైక్ల ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాహనంపై నిల్చున్న నామా ప్రజలకు అభివాదం చేస్తూ మధిర వరకు చేరుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్రెడ్డి, తుటారి నాగేశ్వరరావు, ప్యారీ, కొఠారి రాఘవరావు, బిక్కి కృష్ణప్రసాద్, యన్నంశెట్టి అప్పారావు, అబ్బూరి రామన్, కార్యకర్తలు పాల్గొన్నారు.