సారపాక: మణుగూరులోని బొంబాయికాలనీ వద్ద ఉన్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కనకాచారి తీవ్రంగా ఖండించారు. మణుగూరు బొంబాయికాలనీలో జయశంకర్ సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసంచేయడం దారుణమన్నారు.
విగ్రహాన్ని ధ్వంసం చేసి అశాంతి, అలజడి సృష్టించే ప్రయత్నం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.