భద్రాచలం:భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా దర్శించుకున్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కమి షనర్ యోగితా రాణా బుధవారం భద్రాచలం విచ్చేసారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న లక్ష్మి తాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామివారిని, భద్రుని కోవెలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తహశీల్థార్ శ్రీనివాస్ యాదవ్, ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.