ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 25: జేఈఈ మెయిన్స్కి సంబంధించి గురువారం విడుదలైన ఫలితాల్లో తమ కళాశాలలు అధిక పర్సంటైల్స్తో సత్తా చాటినట్లు ఖమ్మంలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. తమ కళాశాలల విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులతో ప్రతిభ చాటినట్లు వాటి యాజమన్య బాధ్యులు వివరించారు.
తమ కళాశాల విద్యార్థులు ప్రతిష్ఠాత్మక జేఈఈ మెయిన్స్లో ఆలిండియా ర్యాంక్లు సాధించి అగ్రగామిగా నిలిచారని శ్రీచైతన్య కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఓపెన్ కేటగిరీలో తమ విద్యార్థులు శ్రీసాత్విక్-364, నవదీప్ కిరణ్-967, సాత్విక్-969, శ్రీరామ్తేజ-1161, అభిలాష్-1688, సంజయ్-1955వ ర్యాంక్లతో రాణించిట్లు వివరించారు. వీరితోపాటు 99కిపైగా పర్సంటైల్తో 19 మంది ప్రతిభ చూపారన్నారు. ఆలిండియా స్థాయిలో 100లోపు నాలుగు ర్యాంక్లు, 500లోపు 24 ర్యాంక్లు, వెయ్యిలోపు 37 ర్యాంక్లు, 2వేల లోపు 74 ర్యాంక్లు వచ్చినట్లు వివరించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక, డీజీఎం చేతన్ మాధుర్, డీన్ వర్మ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ, ప్రిన్సిపాళ్లు అభినందించారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థుల్థు మరోసారి జయకేతనం ఎగురవేసినట్లు న్యూవిజన్ విద్యాసంస్థల అధినేత చుంచు గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఓపెన్ కేటగిరీలో తమ విద్యార్థి వర్షిత్ కొప్పుల-395, మహాశ్వి-732, శ్రీరామ్-1039, రుషిందర్రెడ్డి-1128, ప్రభంజన్ జాదవ్ -2182, మురళీకృష్ణ-2717వ ర్యాంకులతో సత్తా చాటినట్లు వివరించారు. ఖమ్మంలో ఏ కళాశాల కూడా సాధించని విజయాన్ని తమ విద్యార్ధులు సాధించారని, 99పైగా పర్సంటైల్తో 22 మంది ప్రతిభ చూపారని వెల్లడించారు. మ్యాథ్స్, ఫిజిక్స్లో నూరుశాతం పర్సంటైల్తో సత్తా చాటిన విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ కార్తీక్, డైరెక్టర్ గోపీచంద్, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు అభినందించారు.
తమ విద్యార్థుల్లో 95 మందికిపైగా జేఈఈ మెయిన్స్లో సత్తా చాటి అడ్వాన్స్డ్కి అర్హత సాధించారని హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత పోపూరి రవిమారుత్ తెలిపారు. కేటగిరీలో ర్యాం కుల్లో తమ విద్యార్థి జస్వంత్ జాతీయస్థాయిలో 19వ ర్యాంక్ సాధించాడన్నారు. జనరల్ విభాగంలో జెఘ్నేష్ కృష్ణ ప్రసాద్-2251, రాజ్వర్ధన్-2666, అనీష్-3561, అభినవ్-6150, ప్రణయ్ సంజన్-7668, సాయిసృజయ్-12857, కౌషిక్-13390వ ర్యాంక్లు సాధించినట్లు వివరించారు. 90 శాతానికి పైగా పర్సంటైల్ను 48 మంది విద్యార్థులు సాధించారన్నారు. క్రమశిక్షణాయుత ప్రణాళికతో, నిరంతరం పర్యవేక్షణతో, విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందిస్తూ విజయం సాధించామని అన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి అభినందించారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంక్లు సాధించారని రెజొనెన్స్ కళాశాల డైరెక్టర్లు రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్రావు తెలిపారు. తమ విద్యార్థులు శ్రీకాంత్-7వ ర్యాంక్, ఆసిఫ్-442, భరత్-540, వంశీ-719, జీవన్కుమార్-1116, త్రిషాంక్-1162, కిరణ్కుమార్రెడ్డి-1880, రిషిక్-2608, జగదీష్-2830, రాజ్కుమార్-2901, రాకేష్ సుశాంత్-3004, అరుణ్కుమార్-3061, వీరవర్ధన్-6555, వినాయక్-6805వ వర్యాంకు సాధించారని, మరో 100 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని వివరించారు. ఐఐటీ, నీట్, ఎప్సెట్ వంటి పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్రెడ్డి అభినందించారు.
జాతీయస్థాయి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైళ్లను కైవసం చేసుకున్నట్లు కృష్ణవేణి కళాశాల అధినేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. తమ విద్యార్థుల్లో జశ్వంత్-66, సోనియా-73, ప్రభాస్-83, స్నేహ-199, మాధవరావు-466, సాయికిరణ్-947, నితిన్-1083, రామ్చరణ్తేజ్-1357, నితిన్-1922, సంతోష్-2136, నవదీప్-2196, సంతోష్-2355, మోహిత్-3119, ఉజ్వలామానస-3899, హారిత-3982, త్రివేణి-4243వ ర్యాంక్లు సాధించినట్లు వివరించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాంచందర్రావు, ఇన్చార్జి వంశీ, ఏవో నిరంజన్కుమార్, అధ్యాపకులు అభినందించారు.