దమ్మపేట :మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు బలుసు గోపి మాతృమూర్తి రమణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం బలుసు గోపిని పరామర్శించారు. అనంతరం రమణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పరామర్శించిన వారిలో ఆయన వెంట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, అడపా లచ్చయ్యదొర, మందలపల్లి ఎంపీటీసీ దేవరపల్లి అజయ్కుమార్, మందలపల్లి టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షులు ఆకుల కృష్ణారావు కోఆప్షన్ సభ్యులు సుభానీ(బుడే), సైదా, అబ్దుల్ జిన్నా, ఎస్సై శ్రావణ్కుమార్, నామా సత్యనారాయణ, భాగ్యరాజు, కొల్లి శేఖర్, చీమల మల్లేశ్వరరావు, బలుసు సుబ్బారావు, కృష్ణ తదితరులు ఉన్నారు.