Yogi Adityanath : కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి దేశాన్ని మరోసారి చీల్చేందుకు కుట్ర పన్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. యూపీలోని మొరదాబాద్లో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో చిచ్చు పెట్టేందుకు విపక్ష కూటమి కుట్రను దేశం ఆమోదించబోదని అన్నారు.
వారసత్వ పన్నుతో పాటు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో మరో విషయం పొందుపరిచిందని చెప్పారు. మైనారిటీలు వారు కోరుకునే ఎలాంటి ఆహారమైనా తీసుకునే స్వేచ్ఛ కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో భరోసా ఇచ్చిందని, అంటే గో వధకు ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అర్ధమని ఆందోళన వ్యక్తం చేశారు.
గో వధ చేసుకోవచ్చని మీరు అభయం ఇస్తారా అని కాంగ్రెస్ను ప్రశ్నించారు. దేశ ప్రజల విశ్వాసాలతో వీరు ఎలా చెలగాటమాడుతున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు. గోమాతగా మనం ఆవును పూజిస్తామని, అలాంటి సాధు జంతువును కాంగ్రెస్ నేతలు కసాయిలకు అప్పగిస్తారని యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు.
Read More :
K Sudhakar: బీజేపీ అభ్యర్థిపై ఎఫ్ఐఆర్.. రూ. 4.8 కోట్లు సీజ్