అమరావతి : సీబీఐ మాజీ అధికారి, జైభారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్లో తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ (Visaka CP) కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు గాలి జనార్ధన్రెడ్డి(Gali Janardhan Reddy ) అనుచరులు ప్లాన్ చేశారని ఆరోపించారు.
ఇది ఇలా ఉండగా జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ (Visakhapatnam North) నుంచి జైభారత్ పార్టీ తరుఫున అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన కాలంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్ధన్రెడ్డిని, అక్రమ ఆస్తుల కేసులో జగన్ను, ఇతర కేసులో ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపిన అధికారుల్లో లక్ష్మీనారాయణ ఒకరు.