మణుగూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పేదలకు అందిస్తున్న పథకాలను జనాల్లోకి తీసుకెళ్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా టీఆర్ఎస్వీ మాజీ ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్యాంసుందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
టీఆర్ఎస్వీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు పటిష్టంగా వేయాలని సూచించడంతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు గుండ్ల రంజిత్, రుద్రవెంకట్, బలవంతపు సుధీర్, మైసా వినోద్, తాళ్లపళ్లి రాహుల్, చరణ్, అజయ్, దుర్గ, భరత్, ప్రశాంత్ యాదవ్, సురేందర్ పటేల్ తదితరులు ఉన్నారు.