నల్లగొండ ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ): వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ శాసనమండలి ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ర్యాలీగా బయల్దేరుతుంది. నల్లగొండ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 11 గంటలకు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అనంతరం స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్లో కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. కాగా, నామినేషన్ కార్యక్రమంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. పట్టభద్రులంతా తనను గెలిపిస్తే శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతునవుతానని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి తెలిపారు.