తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగుతున్నది. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 50,524 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 1,17,531 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 67,007 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 9014 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు 57.22 శాతం ఓట్లు వైఎస్ఆర్సీపీ సాధించింది.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మొదటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 2500 ఓట్ల లీడ్లో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది.
కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతికారనంగా తిరుపతి లోక్సభకు ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగింది. వైసీపీ తరఫుణ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..