కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్. అయితే ట్రెండ్స్ ఎన్నికల ఫలితాలను తేల్చవని, ఇప్పటికీ తాము గెలుస్తామన్న ఆశాభావం ఉన్నదని ఆయన అన్నారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది చూద్దాం అని దిలీప్ ఘోష్ చెప్పారు.
మరోవైపు టోలీగంజ్లో బీజేపీ అభ్యర్థి బాబుల్ సుప్రియో వెనుకంజలో ఉన్నారు. దీనిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్ఘియా స్పందించారు. టోలీగంజ్లో బాబుల్ వెనుకంజలో ఉండటం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పుడే ఏమీ చెప్పలేం. సాయంత్రంలోగా మ్యాజిక్ ఫిగర్ దాటొచ్చు అని ఆయన అన్నారు.