నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలకమైన నందిగ్రామ్ స్థానంలో ముఖ్యమంత్రి, టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. ఆరో రౌండ్లో ఆమె 1427 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి ఐదు రౌండ్ల పాటు ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి.. ఒక్కసారిగా వెనుకంజలోకి వెళ్లిపోవడం గమనార్హం. ఐదో రౌండ్లోనే సువేందు ఆధిక్యం 9 వేల ఓట్ల నుంచి 3 వేలకు పడిపోయింది. ఇప్పుడు ఆ ఆధిక్యాన్ని ఆయన కోల్పోయారు.