భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దమోహా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ మందకోడిగా కొనసాగుతున్నది. ప్రస్తుతం నాలుగు రౌండ్లే పూర్తయ్యాయి. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రస్ అభ్యర్థి అజయ్ టాండన్ లీడ్లో ఉన్నారు. గత నెల 17 న జరిగిన ఎన్నికల్లో మొత్తం 22 మంది బరిలో నిలిచారు. కాగా, పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యనే కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ టాండన్, బీజేపీ అభ్యర్థిగా రాహుల్ సింగ్ లోధీ ఉన్నారు.
26 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తయ్యాయి. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ టాండన్ తన సమీప బీజేపీ అభ్యర్థి రాహుల్ సింగ్ లోధీపై 2,617 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చవాన్, కేంద్ర మంత్రి ప్లహ్లాద్ పటేల్లు కాలుకు బలపం కట్టుకుని తిరిగినా ఓట్లు రాలలేదు. ప్రహ్లాద్ పటేల్ ఇదే ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నారు. కాగా, ఈ ఎన్నికను ఛాలెంజ్గా తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్సింగ్లు హోరాహోరీగా ప్రచారం నిర్వహించి తమ పార్టీని గెలిపించే దిశగా తీసుకెళ్లారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన రాహుల్ సింగ్ లోధీ.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పరిణామాల్లో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాహుల్ సింగ్ లోధీ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడాన్ని ఇక్కడి బీజేపీ నేతలకు నచ్చలేదు. అలాగే, అధికారం కోసం పార్టీనే వదిలారన్న అపవాదు కూడా రాహుల్పై ఉన్నది. ఎన్నికలు పూర్తికాకముందే తన గెలుపు ఖరారైందని, తాను చేసిన అభివృద్ధిపనులే తనను గెలిపిస్తున్నాయని రాహుల్ చెప్పుకున్నారు. దాంతో ఆయన ఓటమి ఖాయమైంది.
రాజస్థాన్ ఉప ఎన్నిక : ఒక్క స్థానంలో బీజేపీ, రెండింటిలో కాంగ్రెస్ ఆధిక్యం
యూపీలో వారాంతపు లాక్డౌన్ సమయం పొడగింపు
అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ
ఆధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
పుదుచ్చరిలో ముందంజలో ఎన్డీఏ కూటమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..