లక్నో : ఉత్తరప్రదేశ్లో నానాటికి పరిస్థితి తీసికట్టుగా మారుతుండటంతో రాష్ట్రంలో ఇప్పటికే విధించిన వారాంతపు లాక్డౌన్ సమయాన్ని పొడగించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. వారాంతాల్లో లాక్డౌన్ను కొనసాగిస్తున్న ప్రభుత్వం.. మరోసారి సమయం పొడగింపుతోపాటు సోమవారం కూడా లాక్డౌన్ కిందకు తీసుకొచ్చింది.
వారాంతపు లాక్డౌన్ను శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం తెల్లవారు జాము 7 గంటల వరకు ఇదివరకు ఉండేది. కాగా ఈ సమయాన్ని సోమవారంను కలుపుకొని మంగళవారం ఉదయం 7 గంటల వరకు పొడగించారు. ఈ సమయంలో అత్యవసర సర్వీసులకు సంబంధించిన సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
సోమవారం ఉదయం మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు సమయం పొడగింపు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్వులను కఠినంగా అమలుజరుపాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. గత బుధవారం వరకు 29,824 కొత్త కేసులు కలుపుకొని మొత్తం 11,82,848 కేసులు నమోదయ్యాయి. 11,943 మంది చనిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. గత 24 గంటల్లో 35,903 మంది వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, లక్నోలో అత్యధికంగా 3,759 కేసులు, వారణాసిలో 1,909, కాన్పూర్లో 1,650, మీరట్లో 1,355, అలహాబాద్లో 1,261, ఆగ్రాలో 1,076, ఘోరక్పూర్లో 1,045, బరేలిలో 1,041 కేసులు నమోదయ్యాయి.
అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ
ఆధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
పుదుచ్చరిలో ముందంజలో ఎన్డీఏ కూటమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..