చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. సీఎం పళనిస్వామి స్వయంగా బరిలో దిగిన సాలెం నియోజకవర్గంలో తొలి నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. పళనిస్వామి 14 వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. పళస్వామికి 23,221 ఓట్లు పోలవగా, తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థికి కేవలం 8,364 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కొలతూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గంలో లీడ్లో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బెంగాల్లో వింత పరిస్థితి.. ఆధిక్యంలో తృణమూల్.. వెనుకంజలో సీఎం మమత
ఆక్సీజన్ కోసం బైక్ అమ్మేందుకు సిద్ధమైన ఫిదా స్టార్
టోలిగంజ్లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ
సాగర్ ఉప ఎన్నిక ఫలితం.. 4 వేల ఓట్ల మెజార్టీతో భగత్ ముందంజ