పుదుచ్చరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చరిలో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నది. 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజా సమాచారం మేరకు.. 11 స్థానాల్లో బీజేపీ కూటమి లీడింగ్లో ఉన్నది. ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరిగాయి. పుదుచ్చరి, కైరాకల్, మాహి, యానాం ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. యూటీ మొత్తంలో 17వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. కైరాకల్లో అయిదు స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. పుదుచ్చరిలో మొత్తం 82 శాతం పోలింగ్ జరిగింది. 324 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.