కోల్కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన భవానిపూర్ నియోజకవర్గం నుంచి ఈసారి టీఎంసీ అభ్యర్థిగా శోభన్దేబ్ చటోపాధ్యాయ పోటీ చేశారు. మమతా బెనర్జీకి సంపూర్ణ ఆధిక్యం ఉన్న స్థానం ఇదే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆమెది ఇదే నియోజకవర్గం. కానీ ఈసారి ఎన్నికల్లో ఆమె ఈ స్థానం నుంచి పోటీ చేయలేదు. నందీగ్రామ్ నుంచి ఆమె పోటీ చేసిన విషయం తెలిసిందే. రెబెల్ సువేందు అధికారిపై విజయం సాధించాలన్న పట్టుదలతో .. మమతా బెనర్జీ తన స్వంత స్థానాన్ని వదులుకున్నారు. నందీగ్రామ్లో సువేందు, దీదీ మధ్య థ్రిల్లర్ కొనసాగుతోంది. తొలుత సువేందు లీడింగ్లో ఉన్నా.. ఇప్పుడిప్పుడే దీదీ ఆధిక్యంలోకి వచ్చేశారు. భవానిపూర్ నుంచి మమతా బెనర్జీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శోభన్దేబ్ ప్రస్తుతం లీడింగ్లో ఉన్నారు.