(Tungabhadra Dam) కర్నూలు: తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో తుంగభద్ర డ్యామ్ నీటితో నిండిపోయింది. తుంగభద్ర జలకళ సంతరించుకోవడంతో పశ్చిమ ప్రాంత ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి జలాశయంగా తుంగభద్ర కొనసాగుతున్నది. 39 ఏండ్ల అనంతరం జలాశయంలో 98. 393 టీఎంసీల నీరు నిల్వకు చేరుకున్నాయి. దీంతో కర్నూలు, అనంతపురం, కడప, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
ప్రస్తుతం తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులకు గాను, 1632.36 అడుగులు, 100.855 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 98. 393 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. వరద నీరు పోటెత్తడంతో జలాశయనికి ఇన్ఫ్లో 7,291 వేల క్యూసెక్కులుగా.. అవుట్ ఫ్లోగా 3,424 గా ఉన్నది. 3,424 వేల క్యూసెక్కుల నీరు వివిధ కాలువల ద్వారా దిగువకు నిరు విడుదల చేస్తున్నారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..