(Python in Kurnool) కర్నూలు జిల్లాలో పొడవైన కొండచిలువ కనిపించి కలకలం రేపింది. పసురపాడులోని ఓ తోటలో కనిపించడంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు ఆ కొండచిలువను పట్టుకుని మహానంది సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు.
కర్నూలు జిల్లా పసురపాడులో కొండచిలువ దర్శనమిచ్చింది. దాదాపు 10 అడుగులు పొడవున్న కొండచిలువ గ్రామశివారులోని ఓ రైతు మిరప తోటలో హాయిగా నిద్రపోయింది. తోటలో కొండచిలువ కనిపించగానే సమీపంలోని రైతులు భయాబ్రాంతులకు గురయ్యారు. విషయాన్ని జిల్లా అటవీ అధికారులకు చేరవేయడంతో వారు ఆగమేఘాలమీద పసురపాడు గ్రామానికి వచ్చి కొండచిలువను బంధించారు. అనంతరం దానిని మహానంది సమీపంలో అడవిలో వదిలిపెట్టారు. దాంతో పసురపాడు గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.
వైరస్తో ఊబకాయులకు యమ డేంజర్ అంటున్న నిపుణులు
వాట్సాప్లో హలో మమ్మీ! హలో డాడీ.. అంటూ వచ్చే మెసేజ్లతో జాగ్రత్త!.. ఎందుకంటే..
వేరియంట్కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు : వైరల్ వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..