నెల్లూరు : (Mobile thiefs) అతి తక్కువ ధరకే సెల్ ఫోన్లు విక్రయిస్తున్న ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. నలుగురు సభ్యుల ముఠాలో ఇద్దర్ని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి నుంచి 228 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.10 వేల ఫోన్లను సగం ధరకే అమ్ముతుండటంతో సమాచారం పోలీసుల వరకు చేరి చివరకు కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. తక్కువ ధరకే ఫోన్లు వస్తుండటంతో ప్రజలు ముఖ్యంగా యువకులు బిల్లుల గురించి అడగడకపోవడం వీరికి వరంగా మారింది.
గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా గూడూరు ప్రాంతంలోని గ్రామాల్లో ఒక ముఠా మొబైల్ ఫోన్లను చీప్ ధరలకు అమ్ముతున్నది. ఫోన్ విక్రయ ముఠాపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టి గూడురులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకి చెందిన మేకల కృష్ణ, మేకల పవన్ గా గుర్తించారు. వీరి నుంచి 228 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లు కొట్టేసి ఏదో ఒక ధరకు అమ్మేస్తూ సొమ్ము చేసుకోవడం వీరి పని. ఏపీలో కొట్టేసి, ఏపీలోనే అమ్మేస్తే అనుమానం వస్తుందని.. చెన్నైలో దొంగిలిస్తున్నారు. చెన్నై రద్దీ ప్రాంతాల్లో ఫోన్లు దొంగిలించి ఫార్మెట్ చేసి, కొత్త ఫోన్లలా పల్లెటూళ్లలో సగం రేటుకే అమ్మేస్తున్నారు. నలుగురు సభ్యుల ముఠా ఈ దొంగ ఫోన్లను విక్రయిస్తున్నట్లు గూడూరు పోలీసులు తేల్చారు. పరారీలో ఉన్న మరో ఇద్దర్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు.
ఆపరేషన్ పరివర్తన్ విజయవంతం : వినీత్ బ్రిజ్లాల్
పేదల జీవితాలతో కేంద్ర, రాష్ట్రాల చెలగాటం : సీపీఐ రామకృష్ణ
ఈ నెల 15 నుంచి భవానీ మండల దీక్షధారణలు
అబ్బురపరిచే జ్ఞాపకశక్తి ఈ చిన్నారి సొంతం..
రైతుల పాదయాత్రను ఆపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది: చంద్రబాబు
సిక్కోలు చిరకాల స్వప్నం నెరవేరుతుంది : ధర్మాన ప్రసాదరావు
వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వాలి: వెంకయ్యనాయుడు
పాపికొండలకు పద పద పద.. బోట్ యాత్ర షురూ!
చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందేలు.. 32 మంది అరెస్ట్, 60 కోడిపుంజులు స్వాధీనం
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..