హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాజకీయపరంగా ఏపార్టీలో ఉన్నా యాదవులంతా ఒక్కటిగా ఉండాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన యాదవ సంఘం నాయకుల సమావేశానికి ఆ యన హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలుగు రాష్ట్రా ల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్నామని, ఐక్యంగా ఉంటేనే రాజకీయ, సా మాజిక, ఆర్థిక పరంగా అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
చిన్న చిన్న పొరపొచ్చాలను పక్కనబెట్టి సంఘటితంగా ముం దుకెళ్లాలని సూచించారు. తెలంగాణకు చెందిన వాడినైప్పటికీ మీకు ఎలాంటి అవసరం వచ్చినా అండగా నిలుస్తానని భరోసానిచ్చారు. ఆ తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను తలసాని కుటుంబసమేతంగా దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ పండితు లు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. దుర్గమ్మ తల్లి దీవెనలు తెలుగు రా ష్ట్రాలపై ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.