ఒంగోలు : (Ayyappa Divotees) ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో స్నానానికి చెరువులోకి దిగిన ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లిలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది.
తెల్లవారు జామునే స్నానం చేసేందుకు అయ్యప్ప స్వాములు చెరువులోకి దిగారు. చెరువు లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు స్వాములు ఒకరితర్వాత ఒకరు మునిగిపోయారు. వీరిని బయటకు తీసేందుకు గ్రామస్తులు, పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ముగ్గురు అయ్యప్ప స్వాములు ఒకేసారి చనిపోవడంతో నాగరాజుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా ఉండగా, నలుగురు చెరువులో పడవలో వెళ్తుండగా పడవ తిరగబడి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా మరో కథనం వినిపిస్తున్నది. ముగ్గురు చనిపోగా, ఒకరు సురక్షితంగా బయటపడినట్లు గ్రామస్తులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందేలు.. 32 మంది అరెస్ట్, 60 కోడిపుంజులు స్వాధీనం
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
జింక్తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..