ప్రకాశం : (Mahapadayatra) అమరావతి రాజధాని కోసం నడుం బిగించిన రైతుల మహా పాదయాత్ర 7 వ రోజుకు చేరుకున్నది. రైతులు, మహిళలు ప్రభంజనంలా కదులుతున్నారు. శనివారం 14 కి.మీ. మేర సాగిన పాదయాత్ర.. ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ ఉదయం 8 గంటలకు పర్చూరు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ దాదాపు 17 కిలోమీటర్ల మేర కొనసాగి ఇంకొల్లులో ముగుస్తుంది.
మధ్యాహ్నం పర్చూరు మండలం వంకాయలపాడులో భోజనం చేశారు. అక్కడి నుంచి ఇంకొల్లుకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. కార్తీక సోమవారం సందర్భంగా రేపు పాదయాత్రకు విరామం ఇచ్చారు. మంగళవారం యథావిధిగా కొనసాగనున్నది. ఇదిలా ఉండగా, పాదయాత్ర సాగుతున్న తీరుపై పోలీసులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులను పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో మోహరించారు. హైకోర్టు ఆదేశాల మేరకే పాదయాత్ర సాగుతున్నదని జేఏసీ నాయకులు పోలీసులకు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించడం లేదని స్పష్టం చేశారు.
‘న్యాయస్థానం నుంచి దేవస్థాననం’ మహా పాదయాత్ర శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ జిల్లాలో 12 రోజులపాటు యాత్ర కొనసాగనున్నది. మార్గం మధ్యలో విశ్రాంతి కోసం రెండు రోజులు ఆగనున్నారు. జిల్లాలో పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, కందుకూరు, గుడ్లూరు తదితర మండలాల మీదుగా పాదయాత్ర సాగనున్నది. 19 వ తేదీన నెల్లూరు జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది.
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
జింక్తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
వాయు కాలుష్యంతో జాగ్రత్త.. గుండెను బలహీనపరుస్తుందని హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..