ఏలూరు : (Cock Fighting) దీపావళి నిన్ననే ముగిసింది. ఇంకా కార్తీక మాసం ముగియలేదు. అప్పుడే కోడిపందేలా జోరు ప్రారంభమైంది. సంక్రాంతికి ఉభయ గోదావరి జిల్లాలో జోరుగా కనిపించే కోడి పందేలు.. ఇప్పుడే మొదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా నాగిరెడ్డిగూడెంలో పోలీసులు దాడులు నిర్వహించి కోడిపందేల్లో పాల్గొన్న 32 మందిని అరెస్టు చేశారు. 60 కోడిపుంజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి బైకులు, కార్లు, నగదు కూడా స్వాధీన పర్చుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని చింతలపూడి మండలం యర్రంపల్లిలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. జంగారెడ్డి గూడెం డీఎస్పీ రవికిరణ్ ఆధ్వర్యంలో సెబ్ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపి కోడిపందేలు నిర్వహిస్తున్న 32 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరు పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. వీరి నుంచి దాదాపు రూ. లక్ష నగదుతోపాటు 40 బైకులు, 20 కార్లు, 60 కోడిపుంజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
జింక్తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
వాయు కాలుష్యంతో జాగ్రత్త.. గుండెను బలహీనపరుస్తుందని హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..