చిత్తూరు : (Tomatos) టమాటలకు ప్రసిద్ధిగాంచిన మదనపల్లి మార్కెట్లో టమాట ఠారెత్తిస్తున్నది. వినియోగదారులు కొనేందుకు జంకుతుండగా.. ధర రోజురోజుకు కొండెక్కుతున్నది. రైతులు మాత్రం ఎప్పటిలానే దళారుల చేతుల్లో మోసపోతున్నారు. కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిన సామాన్యులకు టమాట ధరలు మరింత షాకిస్తున్నాయి. సామాన్య ప్రజలు టమాట అంటేనే వణికిపోతున్నారు.
ప్రస్తుతం మదనపల్లె మార్కెట్యార్డులో మొదటి రకం టమాట కిలో ధర రూ.74గా ఉన్నది. నెల రోజులుగా జిల్లాలోని పడమటి మండలాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి అనూహ్యంగా తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ధర కూడా పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తున్నది.
మదనపల్లి మార్కెట్లో కిలో టమాటా రికార్డ్ స్థాయిలో రూ.74 వరకు పలుకుతున్నది. అన్ సీజన్లో అత్యధిక ధర నమోదైంది. నాలుగేండ్లుగా అన్ సీజన్లో ఇదే అత్యధిక ధర అని వ్యాపారులు చెప్తున్నారు. రాష్ట్రంలో పెద్దగా దిగుబడులు లేకపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో రూపాయికి కిలో పలికిన టమోటా ధర.. ఇప్పుడు ఏకంగా ఆకాశాన్నంటుతున్నది. వారం రోజులుగా కిలో టమోటా ధర రూ.30 ఉండగా, ఆదివారం ఏకంగా కిలోకు రూ.20 పైగా పెరిగింది. మదనపల్లె మార్కెట్కు నిత్యం 300-400 టన్నుల టమోటా విక్రయానికి వస్తుంటుంది.
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
జింక్తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
వాయు కాలుష్యంతో జాగ్రత్త.. గుండెను బలహీనపరుస్తుందని హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..