విజయవాడ : (Operation Parivarthan) ఆపరేషన్ పరివర్తన్ విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. 800 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు ఆయన చెప్పారు. గంజాయి సాగును అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ఆపరేషన్ పరివర్తన్లో 80 టీమ్లు పాల్గొన్నాయని, గంజాయిని ధ్వంసం చేయకుండా గిరిజనులు ప్రతిఘటిస్తున్న సంఘటనలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో గిరిజ నులే స్వచ్ఛంధంగా ముందుకు వస్తున్నారని, 150 ఎకరాల్లో గంజాయి పంటను గిరిజనులే స్వయంగా ధ్వంసం చేశారన్నారు.
ఆంధ్రా ఓడిశా బార్డర్ (ఏఓబీ) లోనే గంజాయి సమస్య అధికంగా ఉన్నదని వినీత్ బ్రిజ్లాల్ వెల్లడించారు. ఆంధ్రా, ఒడిశాలో కలిపి ఎమిమిది జిల్లాల్లో గంజాయి సమస్య ఎక్కువగా ఉన్నదని తెలిపారు. గంజాయి సాగు, సరఫరా వెనుక గిరిజనులను అడ్డం పెట్టుకుని ఏదైనా పెద్ద నెట్ వర్క్ ఉందా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. గంజాయితో పాటు హెరాయిన్ వంటి ఇతర డ్రగ్స్ సమస్యలపైనా దృష్టి పెట్టినట్లు వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు.
పేదల జీవితాలతో కేంద్ర, రాష్ట్రాల చెలగాటం : సీపీఐ రామకృష్ణ
ఈ నెల 15 నుంచి భవానీ మండల దీక్షధారణలు
అబ్బురపరిచే జ్ఞాపకశక్తి ఈ చిన్నారి సొంతం..
రైతుల పాదయాత్రను ఆపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది: చంద్రబాబు
సిక్కోలు చిరకాల స్వప్నం నెరవేరుతుంది : ధర్మాన ప్రసాదరావు
వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వాలి: వెంకయ్యనాయుడు
పాపికొండలకు పద పద పద.. బోట్ యాత్ర షురూ!
చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందేలు.. 32 మంది అరెస్ట్, 60 కోడిపుంజులు స్వాధీనం
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..