అమరావతి : (Chandra Babu) అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న మహా పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి ప్రభుత్వం ఓర్వలేకపోతున్నదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే ఈ యాత్రను నిలుపుదల చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఆపేసి ఇప్పటికే ప్రభుత్వం క్షమించరాని తప్పు చేసిందని మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే.. ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవడం సిగ్గుచేటన్నారు. రైతుల యాత్రను అడ్డుకుని చరిత్రహీనులుగా మిగులొద్దని హితవు పలికారు.
శాంతియుత వాతావరణంలో రైతులు, మహిళలు పాదయాత్ర కొనసాగిస్తుండగా.. వీరిని అడ్డుకునేందుకు కొవిడ్ను సాకుగా చూపుతున్నారని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నాయకులు సభలు, పాదయాత్రలు, సభలు పెడితే గుర్తుకురాని కొవిడ్ నిబంధనలు, రైతులు యాత్ర చేపడితేనే రావడం ఆశ్చర్యకరంగా ఉన్నదన్నారు. ప్రజావ్యతిరేకతను పోలీసులను పెట్టి అణగదొక్కాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఇది అత్యంత హేయమైన చర్య అని అన్నారు.
సిక్కోలు చిరకాల స్వప్నం నెరవేరుతుంది : ధర్మాన ప్రసాదరావు
వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వాలి: వెంకయ్యనాయుడు
పాపికొండలకు పద పద పద.. బోట్ యాత్ర షురూ!
చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందేలు.. 32 మంది అరెస్ట్, 60 కోడిపుంజులు స్వాధీనం
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..