విజయవాడ : (AP Weather) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపునకు ప్రయాణించే అవకాశం ఉన్నదని వెల్లడించింది. దీని ప్రభావంతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అదేవిధంగా కోస్తా, ఆంధ్ర, రాయలసీమలో తేలికపాటి వానలు పడనున్నాయి. తీరం వెంబడి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకవాశం ఉన్నదని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గరలోని దక్షిణ ఆంధ్ర కోస్తా ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళఖాతం దగ్గరలోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీద ఉన్నది. ఇది సగటు సముద్ర మట్టానికి 4 .5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని దగ్గర ఉన్న భూమధ్య రేఖ వద్ద ఉన్న హిందూ మహా సముద్రము-సుమత్రా తీర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 .1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
పేదలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటాం : డిప్యూటీ సీఎం ధర్మాన
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి గాయాలు
కాళేశ్వరంలో కార్తీక శోభ.. భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు.. వైసీపీ శ్రేణుల సంబురాలు
రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..