విజయవాడ : (CPI Ramakrishna) పెట్రోల్, డీజీల్ రేట్లు పెరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ వ్యాట్ తగ్గించకుండా చోద్యం చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పేద ప్రజల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలపై అధికంగా భారం మోపుతూ అదానీ వంటి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే పోర్టులు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను అదానీకి అప్పగించారన్నారు. రాష్ట్రం మొత్తాన్ని వారికి దోచిపెట్టడానికే జగన్ అధికారంలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలు పక్కదారి పడుతున్నా జగన్కు సోయి లేదన్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి అధికార పార్టీ ప్రతిపక్షాలపై తిట్ల దండకం అందుకున్నదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించాలి, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ నెల 15 నుంచి భవానీ మండల దీక్షధారణలు
అబ్బురపరిచే జ్ఞాపకశక్తి ఈ చిన్నారి సొంతం..
రైతుల పాదయాత్రను ఆపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది: చంద్రబాబు
సిక్కోలు చిరకాల స్వప్నం నెరవేరుతుంది : ధర్మాన ప్రసాదరావు
వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వాలి: వెంకయ్యనాయుడు
పాపికొండలకు పద పద పద.. బోట్ యాత్ర షురూ!
చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందేలు.. 32 మంది అరెస్ట్, 60 కోడిపుంజులు స్వాధీనం
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..