హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): అఖిల భారత పోలీస్ డ్యూటీమీట్లో రాష్ట్ర పోలీస్ విభాగం సరికొత్త రికార్డు సృష్టించింది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన 69వ జాతీయస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతి భ కనబర్చిన రాష్ట్ర పోలీస్ బృందం, మూడోసారి ‘ఓవరాల్ చాంపియన్’ ట్రోఫీని కైవసం చేసుకున్నది. ఈ సందర్భంగా విజేతలు, వారికి శిక్షణ ఇచ్చిన అధికారులను డీజీపీ బీ శివధర్రెడ్డి అభినందించారు. రాష్ట్ర పోలీస్ విభాగం సాధించిన ఈ ఘనత తెలంగాణ కీర్తికిరీటంలో మరో మైలురాయిగా నిలుస్తుంద ని, అధికారుల అంకితభావం, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమని ప్రశంసించారు.
అత్యంత క్లిష్టమైన యాంటీ సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్నెస్ పోటీల్లో రాష్ట్ర పోలీసు లు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలను సొంతం చేసుకున్నారని కొనియాడారు. వీటితోపాటు సైంటిఫిక్ ఎయి డ్స్ టు ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఫొటోగ్రఫీ విభాగాల్లోనూ ద్వితీ య స్థానంలో నిలిచారని తెలిపారు. డ్యూటీ మీట్లో 6 బంగారు, 3 వెండి, 3 కాంస్య పతకాలు గెలుచుకున్న సందర్భంగా సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసిన్హా, ప్రధాన కోచ్లు ప్రతాప్ (అదనపు ఎస్పీ టీజీజెన్కో), రామకృష్ణ (కమాండెంట్ 8వ బెటాలియన్), టీమ్ మేనేజర్ కే ప్రసాద్ (ఎస్పీ సీఐడీ)తోపాటు విజేతలకు డీజీపీ శుభాకాంక్షలు తెలియజేశారు.