కుభీర్: సరదాగా ఈతకు వెళ్లిన బాలుర కుటుంబాల్లో డోడర్నా చెరువు తీరని విషాదాన్ని( Tragedy ) నింపింది. కుభీర్కు చెందిన ముగ్గురు బాలురు ఈత కోసం వెళ్లారు. ఒకరు ఒడ్డున ఉండగా, సోఫియాన్(10), గణేష్ చెరువులోకి ఈతకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.
స్థానికులు వెంటనే వారిని బయటకు తీశారు. సోఫియాన్(10) అక్కడికక్కడే మృతి చెందగా ,గణేష్ను చికిత్స కోసం బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల మృతితో కుబీర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.