(APS RTC Buses) విజయవాడ: సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది. ఈసారి 1266 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయంచింది. విజయవాడ కేంద్రంగా ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతలకే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకూ ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
ప్రత్యేక బస్సులు జనవరి 7 నుంచి 17 వరకు నడుస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్కు దాదాపు 362 బస్సులను వేస్తున్నారు. బెంగళూరుకు 14, చెన్నైకి 20 బస్సులు నడవనున్నాయి. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు, విజయవాడ-రాజమండ్రి మద్య 360, ఇతర ప్రాంతాలకు మరో 120 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేయనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తారు.
పండుగ సీజన్లో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తిరుగు ప్రయాణంలో కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ఇళ్లకు చేరుకుని పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితంగా ప్రయాణించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఆకాంక్షించింది.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..