(Private Layouts) అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ లేఅవుట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నది. లేఅవుట్ యజమానులు 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలన్న నిబంధన తీసుకొచ్చారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. లేఅవుట్లో తక్కువ భూమి ఉంటే యజమానులు మున్సిపాలిటీలకు సమానమైన మొత్తాన్ని చెల్లించాలని లేదా ఆ ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. లేఅవుట్లలో తీసుకున్న భూమిలో 5 శాతం పేదలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు ప్రభుత్వ శాఖల్లో పరస్పర బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 4 వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని, పరస్పర అంగీకారంతో బదిలీలకు అనుమతించనున్నట్లు పేర్కొన్నది. ఈ నిర్ణయం ప్రకారం ఒకేచోట రెండేండ్ల కన్నా ఎక్కువ సమయం పాటు పనిచేసిన వారు పరస్పర బదిలీలకు అర్హులు కానున్నారు.
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..