(Amaravati Nrithyotsav) విజయవాడ: సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న అమరావతి నృత్యోత్సవ్-2021 ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. రెండో రోజు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం, పురూలియా చౌ వంటి నృత్య రూపకాలను తిలకించి ప్రేక్షకులు తన్మయత్వంలో మునిగితేలారు. నృత్యంలో విశేష కృషిచేసిన పరేష్ ప్రసాద్ పరీత్, అనుపమ మోహన్, కేవీ లక్ష్మి, సిక్కిల్ వసంత కుమారిని ప్రేక్షకుల సమక్షంలో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
కేరళకు చెందిన అనుపమ మోహన్ శిష్యులు చేసిన కూచిపూడి నృత్యంతో రెండో రోజు ఉత్సవం ప్రారంభమైంది. వారు ‘అంబ సాంభవి’,‘తిల్లాన’ కీర్తనలకు ప్రదర్శించారు. తమిళనాడుకు చెందిన సిక్కిల్ వసంత కుమారి విద్యార్థులు భరతనాట్య నృత్య శైలిలో సరస్వతి స్తోత్రం, శివ స్తోత్రాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కేవీ లక్ష్మి నేతృత్వంలోని నటరాజ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు చక్కటి సమన్వయంతో ‘రామాయణ పట్టాభిషేకం’ నిర్వహించారు. జార్ఖండ్కు చెందిన పురూలియా చౌ ‘మహిషాసుర మర్ధని’ డ్యాన్స్ ఐటెంను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని నటరాజ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ బీ విక్రమ్ కుమార్ నిర్వహించారు.
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..