అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండంతో ప్రభుత్వం నివారణా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే సాయంత్రం కర్ఫ్యూ అమలు చేస్తుండగా, నేటి నుంచి పగటిపూట కర్ఫ్యూ కూడా అమలవుతుంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు చేస్తున్నది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు రెండు వారాలపాటు అమల్లో ఉంటాయి. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప మిగతా వ్యక్తులెవరు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీళ్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఏపీలో 18 గంటల కర్ఫ్యూ అమల్లోకి రావడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలను నిలిపివేయనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తిరిగే సుమారు 2500 వరకు బస్సులకు బ్రేకులు పడ్డాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు కలిసి రోజూ 1400 నుంచి 1500 బస్సుల వరకు నడుపుతున్నాయి. మరో తొమ్మిది వందల వరకు ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. కర్ఫ్యూ నేపథ్యంలో ఇవన్నీ డిపోలకు, షెడ్లకు పరిమితం కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..