ముంబై: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాపై వేటు పడింది. ఆమె ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ట్విట్టర్ సంస్థ మంగళవారం ప్రకటించింది. ద్వేషపూరిత ప్రవర్తనను నిరోధించేందుకు ట్విట్టర్ పొందుపర్చిన నిబంధనలను ఆమె పలుమార్లు ఉల్లంఘించారని పేర్కొంది. బెంగాల్లో హింసపై కంగన స్పందిస్తూ.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హింసాకాండకు మమతా బెనర్జీయే కారణమని ట్విట్టర్లో ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తన ఖాతాను తొలగించారని కంగన పేర్కొన్నారు.