Forests | కాసిపేట, మార్చి 17: అడవిలో అగ్ని ప్రమాదాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ బి ప్రవీణ్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో పెద్దాపూర్, కోలంగూ తదితర గ్రామాల్లో అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రవీణ్ నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ.. అటవీ రక్షణలో భాగంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ లైన్లు చేయడం,. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ బ్లోవర్లతో నిప్పు ఆర్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ జరిగే నష్టం చాలా పెద్దదని, వన్యప్రాణుల ఆవాసం చెదిరి, విలువైన వృక్ష సంపద కనుమరుగు అవుతుందన్నారు. అలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజల్లో చైతన్యం వస్తే అడవిలో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
పశువుల కాపరులు తమ వెంట గొడ్డళ్లు తీసుకెళ్లరాదని, చిన్న చిన్న చెట్లను మేత కోసం నరకడం నేరమని, చట్ట పరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మహేశ్, ఉపాధి హామీ కార్మికులు, గ్రామస్తులున్నారు.
MP Shanmugam | ‘నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా’.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..?
Hema- Surekha | తోటలో ఎంజాయ్ చేసిన హేమ- సురేఖవాణి.. ఈతకల్లు తాగుతూ హల్చల్
Faisal Malik | బాలీవుడ్ ‘రామాయణ’లో కుంభకర్ణుడిగా ‘పంచాయత్’ నటుడు!