జగిత్యాల : రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ ఎం.డి. మాదర్ ( MD Madhar ) కు ఆర్టీసీ ( RTC ) యాజమాన్యం అండగా నిలిచింది. యూబీఐ (UBI) పథకం కింద ప్రమాద బీమా పరిహారంగా రూ.50 లక్షల చెక్కును( Cheque ) అందజేశారు.
కోరుట్ల డిపోకు చెందిన డ్రైవర్ ఎం.డి. మాదర్ గత అక్టోబర్ 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తన కుడి కాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో యూబీఐ పథకం కింద లభించిన ప్రమాద బీమా ప్రయోజనంలో భాగంగా ఆర్టీసీ యాజమాన్యం రూ.50 లక్షల చెక్కును అందజేసింది. ఈ మేరకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి , యూపీఐ బ్యాంక్ సీజీఎం ఎం రవీంద్రబాబు, డీజిఎం ఎన్ సత్యనారాయణ బాబ్జి , ఏజీఎం రంజన్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో బాధిత డ్రైవర్ ఎం.డి. మాదర్కు రూ.50 లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి ఆర్టీసీ యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన తనకు యూబీఐ పథకం ద్వారా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించిన ఆర్టీసీ యాజమాన్యా నికి డ్రైవర్ ఎం.డి. మాదర్ , కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పి సోలోమన్, సిహెచ్ వెంకన్న, ఎం.రాజశేఖర్, కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి. రాజు , కోరుట్ల డిపో మేనేజర్ ఎన్. మనోహర్ పాల్గొన్నారు.