NASSCOM President debanji ghosh | నీతి ఆయోగ్ ఇటీవల అందజేసిన ‘ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’ అవార్డు అందుకున్న 75 మంది మహిళలలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. 2018 నుంచి నాస్కామ్కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఉంటూ.. అటు సంస్థకు, ఇటు భారతీయ ఐటీ రంగానికి టార్చ్బేరర్గా ఉన్న దేబ్జానీ ఘోష్ది విభిన్నశైలి.
బోర్డ్ సమావేశం, సెమినార్, మేధోమథన సదస్సు ఏదైనా సరే దేబ్జానీ మాట్లాడనంత వరకే సరదా సన్నివేశాలు. ఒక్కసారి ఆమె మాట్లాడటం మొదలుపెడితే.. చెవులు రిక్కించి వినాల్సిందే. ఎందుకంటే తన మేధోమథనం నుంచి వచ్చే ప్రతి ఆలోచనా కార్యరూపం దాల్చాల్సిందే. ఆమె ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు అనుభవించారు. తన చదువుకు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధమే లేకపోయినా ఓ ఐటీ దిగ్గజ సంస్థకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యారు. రాజనీతిశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎంబీఏ చేశారు. ఆ తర్వాత మార్కెటింగ్ రంగంలో నిలదొక్కుకుని.. ఇంటెల్ టెక్ కంపెనీలో ఉద్యోగం సాధించారు
భారత్లో ఇంటెల్ వ్యాపారాన్ని విస్తరించడంలో ఆమెది కీలకపాత్ర. ఆ తర్వాత హార్డ్వేర్ సంస్థ ‘అంబ్రెల్లా బాడీ ఎంఏఐటీ’కి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలా తన పనిలోని చురుకుదనమే ఆమెను నాస్కామ్ అధ్యక్షురాలి వరకూ తీసుకొచ్చింది. కరోనా సమయంలోనూ ఐటీ రంగంపై ప్రభావం పడకుండా తీవ్రంగా కృషి చేశారు దేబ్జానీ. ఐటీలో నూతన ప్రతిభను వెన్నుతట్టడం, నైపుణ్య శిక్షణ ఇప్పించడం, కొత్త ఆవిష్కరణల సంస్కృతిని అభివృద్ధి చేసి.. దేశ విదేశాల వారితో కలిసి పనిచేసేలా మనవారిని తీర్చిదిద్దడంపై ఆమె దృష్టిపెట్టారు. ఏదైనా ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు జరిగిన తప్పులు, సాధించిన విజయాల నుంచి మరింత నేర్చుకోవాలని చెబుతుంటారు దేబ్జానీ.
“Kanika Reddy | విమానయాన సంస్థకే సీఈవో అయిన ఈమె ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్”
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”
Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”