Peesapati Likitha | ఆ నృత్యం ‘నవ’నవోన్వేషితం! తొమ్మిది నిమిషాలసేపు నృత్యకారిణిని ‘నవ’దుర్గలు ఆవహించిన భావన. మొత్తం 9,999 పదునైన మేకులు. వాటిపై 9 నిమిషాలు నిలబడి.. 9 శ్లోకాలతో కూడిన 9 నృత్యాంశాలను కూచిపూడి శైలిలో ప్రదర్శించి రికార్డుల పుస్తకాలలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు.. పీసపాటి లిఖిత.
ప్రతి యువతీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలనీ, ఆ కలను సాకారం చేసుకున్నాకే పెండ్లి గురించి ఆలోచించాలని అంటున్నారు యువనర్తకి పీసపాటి లిఖిత. అందుకు తన జీవితమే ఉదాహరణ అని వివరిస్తారు. సంప్రదాయ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి వేదికలపై నృత్యాన్ని ప్రదర్శిస్తే సమాజం ఏం అనుకుంటుందో అని భయపడిపోయే వాతావరణంలో పెరిగారు లిఖిత. అయినా సరే, కూచిపూడి మీద ప్రేమతో కన్నవారిని ఒప్పించి కాలికి గజ్జె కట్టారు. ఆర్థిక సమస్యలు అవరోధమై నిలిచినా, పట్టుదలతో ఆ పరిమితిని అధిగమించారు. ఆమె ఆసక్తిని గమనించిన నృత్య గురువులు అత్యుత్తమ శిక్షణనిచ్చారు. నాట్యానికి సామాజిక బాధ్యతను జోడించి.. తనదైన శైలిలో ప్రదర్శనలు ఇస్తున్నారు లిఖిత. ఇటీవల ఆమె చేసిన ప్రయోగం నృత్యాభిమానులను అబ్బురపరచింది. అవని నృత్యాలయం ఆధ్వర్యంలో నాట్య గురువు రవి కుమార్ పర్యవేక్షణలో 9 నిమిషాలలో.. 9,999 ఇనుప మేకులపై.. 9 శ్లోకాలకు.. 9 ఇతివృత్తాలతో దుర్గామాతను కొలుస్తూ లిఖిత నృత్య ప్రదర్శన కరతాళ ధ్వనులను అందుకున్నది. పదునైన మేకులపై ఏకధాటిగా నృత్యం చేయడం అంటే మాటలు కాదు. నిత్యం నాలుగు గంటలు కఠోర సాధన చేశారు లిఖిత. ‘కష్టం నాదే కావచ్చు, కానీ అమ్మవారి కరుణతోనే ఇదంతా సాధ్యమైంది’ అంటారామె. ఆ ప్రయోగం అనేక రికార్డు పుస్త
కాలకు ఎక్కింది. లిఖిత వృత్తిరీత్యా లెక్చరర్. ఓ ప్రైవేటు కాలేజీలో ఆర్థికశాస్త్రం, బిజినెస్ మేనేజ్మెంట్ బోధిస్తారు. ‘వృత్తి ప్రవృత్తులు రెండూ నాకు ప్రాణం’ అంటున్నారు లిఖిత.
– కేసాని నరసింహారావు
“Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
కార్పొరేట్ కొలువు వదిలేసి 4 దేశాలు చుట్టొచ్చింది.. బేకరీ స్టార్ట్ చేసింది”