madhya pradesh mother | చుట్టూ నిశ్శబ్దం. చీకటి కమ్ముకుంటున్న వేళ. గుడిసె బయట.. ఒడిలోని పసి బిడ్డకు పాలిస్తూ చపాతీలు చేస్తున్నది గిరిజన మహిళ కిరణ్. మిగిలిన ముగ్గురు పిల్లలూ అక్కడే ఆడుకుంటున్నారు. ఎప్పటి నుంచి మాటువేసిందో ఓ చిరుతపులి.. అందులో ఓ బాలుడిపై దూకింది. నోట కరుచుకొని మసక చీకట్లో మాయమైంది. ఆ దృశ్యం చూసి అమ్మ కిరణ్ మనసు తల్లడిల్లింది. ఒడిలోని పాపను పెద్ద పిల్లలకు అప్పగించి, చిరుతవెంట పడింది.
కొడుకు కేకలు వినిపిస్తున్న దారివెంటే పరుగెత్తింది. ముళ్లు గుచ్చుకుంటున్నా, పదునైన రాళ్లు పాదాలను గాయపెడుతున్నా.. ఆ బాధను పంటి బిగువునే దాచుకుని.. చిరుతను వెంటాడింది. ఆ అడుగుల సవ్వడికి చిరుత వెనక్కి తిరిగింది. బాలుడిని వదిలేసి, తల్లిపై దూకింది. కిరణ్ అదరలేదు, బెదరలేదు. కొడుకును కాపాడుకోవాలన్న మమకారం ఎక్కడలేని శక్తినిచ్చింది. తెగించి పోరాడింది. చివరికి మాతృప్రేమ గెలిచింది. క్రూరమృగం పారిపోయింది. మధ్యప్రదేశ్, సీధీ జిల్లా .. సంజయ్గాంధీ నేషనల్ పార్క్ సమీపంలోని బడీ ఝిరియా గ్రామంలో తాజాగా చోటుచేసుకున్న సంఘటన ఇది. బైగా అనే గిరిజన తెగ జాతీయ ఉద్యానవనం సమీపంలో నివాసం ఉంటున్నది. అందులో కిరణ్ కుటుంబం ఒకటి. రక్తమోడుతున్న బిడ్డను భుజానికి ఎత్తుకొని.. సమీపంలోని దవాఖానకు వెళ్లింది కిరణ్. ప్రస్తుతం పసివాడు క్షేమంగా ఉన్నాడు. ‘క్షణం ఆలస్యమైనా, ఆ చిరుతపులి నా బిడ్డను చీల్చేసేదే’ అంటూ కన్నీళ్లు తుడుచుకొంది ఆ తల్లి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇంట్లో చెప్పకుండానే నటించా.. సినిమా విడుదలయ్యాక నాన్నకు తెలిసి..
ఎక్కడ మైక్ పెట్టినా హలో హలో మైక్ టెస్టింగ్ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
custard apple | సీతాఫలాలతో ఐస్క్రీమ్లు తయారు చేస్తున్న పాలమూరు మహిళలు..
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !