Healthy Food | పాశ్చాత్య ఆహారశైలిని విడిచిపెట్టి మనవైన పప్పుధాన్యాలు, ముడిబియ్యం, గోధుమలు, పల్లీలు, బాదం, జీడిపప్పు లాంటి సంప్రదాయ దినుసులను భోజనంలో చేర్చుకొంటే.. జీవన ప్రమాణం కనీసం పదేండ్లు పెరుగుతుందని ఓ తాజా అధ్యయనం తేల్చింది. అంతేకాదు మాంసాహారాన్ని తగ్గించుకోవాలనీ సూచించింది. పెద్దల విషయానికి వస్తే.. ఆహారం వల్ల ఆరోగ్యంలో వచ్చే సానుకూలమైన మార్పు తక్కువేనట. అయినా కూడా మార్పు మంచిదేనని సర్వే తెలిపింది. ఆరోగ్యానికి మూలం ఆహారమే. ఆహార సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటీ పదిలక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. మరో 25 కోట్ల మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఇక యువత ఆహారం మార్పుల విషయానికి వస్తే.. 20 ఏండ్ల వయసులోనే ఏం తినాలనేది గుర్తిస్తే మంచిదని అధ్యయనం వెల్లడించింది. పాశ్చాత్య ఆహారం నుంచి సంప్రదాయ ఆహారానికి మళ్లడం వల్ల స్త్రీలు 10.7 ఏండ్లు, పురుషులు 13 ఏండ్ల వరకు తమ ఆయుష్షును పెంచుకోవచ్చని ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్’ పేరుతో జరిగిన ఈ అధ్యయనం పేర్కొంది.
ఈ ఫుడ్ తింటే పదేండ్లు అధికంగా బతకొచ్చు
“మిల్లెట్స్ను ఎవరైనా తినొచ్చా..? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి..?”
“మీ గుండె పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే ఇవే మీ ఆహారంలో భాగం కావాలి..!!”