చౌటుప్పల్, జూలై24: మానవ మనుగడకు ప్రతి ఒక్క రూ మొక్కలు నాటాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసి అక్కడి నాయకులు, కార్యకర్త లు, ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక అంజనాసాయి వెంచర్లో ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు.
ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ రోగుల సౌకర్యార్థం రూ. 40లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని మా జీ ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని కొయ్యలగూడెం డిస్కవరీ పరిశ్రమ సీఎస్ఆర్ నిధులతో చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంట్కు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నిమిషానికి 64 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నా రు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మా ర్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఊడుగు శ్రీనివాస్గౌడ్, గిర్కటి నిరంజన్గౌడ్, ఆర్టీఏ జిల్లా మెంబర్ తడక చంద్రకిరణ్, కౌన్సిలర్లు ఎండి బాబాషరీఫ్, దండ హిమబిందు అరుణ్కుమార్, కొరగాని లింగస్వామి, సుల్తాన్రాజు, తాడూరి శిరీశాపరమేశ్, రాజ్యలక్ష్మీస్వామిగౌడ్, శాఖ గ్రంథాలయ చైర్మన్ మల్లేశ్గౌడ్, షాదీఖానా చైర్మన్ ఎండి రహీం, దయాకరాచారి, గోవర్ధన్రెడ్డి, బాలకృష్ణగౌడ్ పాల్గొన్నారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు, జూలై 24: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకను మండలంలోని ధర్మారం గ్రామంలో శనివారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ్ధ మాజీ చైర్మన్ మందుల సామేల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం ముక్కోటి వృక్షార్చనలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదు ట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మందుల సామే ల్ మాట్లాడుతూ జీవకోటి మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మంత్రి కేటీఆర్ భవి ష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తాడోజు లక్ష్మణాచారి, నాయకులు శీలం దావిద్, భాగ్యరావు, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు