Paytm | న్యూఢిల్లీ, మే 4: పేటీఎం అనుబంధ సంస్థయైన వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి భావేష్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. గుప్తా..రుణాలు ఇచ్చే వ్యాపారంతోపాటు ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు ఇతర విభాగాలను చూసేవారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీఎల్) రిజర్వు బ్యాంక్ నిషేధం విధించిన నాటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థకు శనివారం మరో షాక్ తగిలింది. ఆర్బీ నిషేధం విధించడంతో సంస్థకు రూ.300-500 కోట్ల వరకు నష్టం వాటిళ్లనున్నట్లు అంచనావేస్తున్నది.