రామన్నపేట: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం మం డలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బత్తిని మహేశ్, పులిపల్లి వీరాసామి ఆధ్వర్యంలో 100మంది ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిసంక్షేమ పథకాన్ని అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు.నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం తో గ్రామాల రూపురేఖలు మారాయని తెలిపారు. ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభు త్వం అమలు చేస్తున్నదన్నారు.
కార్యకర్తలు క్రమశిక్షణతో, నిబద్దతతో పార్టీ అభివృద్ధికి పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పు ప్రకాశ్, మాజీ సర్పంచ్ బత్తుల శంకరయ్య, జోగుల సత్యనారయణ, నీల లింగయ్య, బత్తుల వెంకటేశం, నాగరాజు, మురళి, ప్రదీప్, రామలింగం, యాదయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.