‘యాదాద్రి నిర్మాణాల నాణ్యతలో రాజీలేదు’

యాదాద్రి, నమస్తే తెలంగాణ : యాదాద్రి ప్రధానాలయ నిర్మాణం పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, వెయ్యేళ్లకాలపరిమితితో నిర్మిస్తున్నామని వైటీడీఏ టెక్నికల్ కమిటీ సభ్యుడు కొండల్రావు, ఆలయ ఈఓ ఎన్. గీత స్పష్టం చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వైటీడీఏ టెక్నికల్ కమిటీ బృదం సభ్యులు ఆలయ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం మొదలైన నేపథ్యంలో లీకేజీలేమైనా ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధానాలయం పనులు ఇంకా పూర్తి కాలేదని.. అప్పుడే అంతా అయిపోయింది.. ఏదో జరిగిపోతుందనే ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇంకా నిర్మాణంలో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఉన్నదన్నారు. పురాతన పద్ధతిలో సిమెంటు వాడకుండా వెయ్యేళ్ల కాలపరిమితితో పనులు జరుగుతున్నాయని చెప్పారు. పనుల నాణ్యత పరిశీలనకు పురావస్తు శాఖ నిపుణులు సోమవారం రానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్కిటెక్టు ఆనందసాయి, ఇంజినీర్ మధుసూదన్, వైటీడీఏ స్తపతి డాక్టర్ ఆనందాచార్యుల వేలు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్