కరీంనగర్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 25: ఐఐటీ జేఈఈ (మెయిన్స్)-2024 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు విజయఢంకా మోగించారు. రాష్ట్ర స్థాయిల్లో వివిధ క్యాటగిరీల్లో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం హర్షిత్ 252వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, ఏ వర్జన్ రావు 444, పీ మనోహర్ 466, జీ శ్రీహాస్ 503, బీ భరద్వాజ్ నాయక్ 781, పీ చందన 1213, సత్యాఅమూల్య 1301, సుభోదౌదరి 1367, కే శ్రీనిధి 1562, ఎండీ షఫిక్ 1603, మిత్ర 1612, సీహెచ్ అనూహ్య 1632, ఏ శివవరుణ్ 1719, ఎన్ ప్రణయ్ 1721, పీ రాహుల్ 1751, ఎం ప్రరిణీత్ రెడ్డి 1912, జే ఉమామైత్ర 1953, ఎల్ అరుణ్ కుమార్ 2353, సీహెచ్ సిద్ధ్దార్థ 2444, పీ రాఘవీరారెడ్డి 2510, కే విశాల్ రెడ్డి 2557, కే రోహన్ ప్రీత్ 2643, జే హర్షవర్దన్ 2908, జీ లాహరి 2965వ ర్యాంకులు సాధించారు.
దీంతో విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనిటాన్స్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు. వెయ్యిలోపు ఐదు ర్యాంకులు, 5వేల లోపు 34 ర్యాంకులు సాధించారని, అలాగే 461 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్కు అర్హత సాధించారని సంతోషం వ్యక్తం చేశారు.